న్యూస్ చరిష్మా , ఢిల్లీ: రానున్న పండుగల సీజన్లో పెద్ద ఎత్తున ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణీంచనున్న నేపథ్యంలో అందరూ తీసుకోవాల్సిన కోవిడ్ భద్రతా చర్యల గురించి రైల్వే భద్రతా దళం(ఆర్పిఎఫ్) సవివర మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యేట్లు ఎవరు ప్రవర్తించినా వారికి అపరాధరుసుం తోపాటు జైలు శిక్ష కూడా ఉంటుందని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణీంచేవారు మాస్క్లు ధరించకపోయినా, ధరించినప్పటికీ వాటిని సరిగా ఉపయోగించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా శిక్షలు తప్పవని పేర్కొన్నారు. అదే కరోనా సోకిన వారు రైలు ఎక్కితే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఫలితం రాకముందే రైలు ఎక్కినా తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
రైళ్లలో మాస్కులు ధరించకపోతే జైలుశిక్ష