పాలిటెక్నిక్‌లో కొత్తగా 5 కోర్సులు..


పాలిటెక్నిక్‌ చేరాలనుకునే విద్యార్థులకు విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. వెబ్ డిజైనింగ్, 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల వ్యవధి మూడేళ్గుగా నిర్ణయించారు. కాగా, SBTET నిబంధనల ప్రకారం పాలీసెట్ ద్వారా ప్రవేశాలను నిర్వహించనున్నారు.


కొత్త కోర్సుల వివరాలు:



  • గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్- మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతించింది.

  • తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కిమ్స్ కాలేజీలో ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చింది.

  • కోరంగిలోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్‌లో 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సును అనుమతించింది.

  • రాజానగరంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ విమెన్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో డిప్లొమా కోర్సును మంజూరు చేసింది.