పెట్రోల్‌ ధర మళ్లీ పెరిగింది...


న్యూఢిల్లీ: మళ్లీ చమురు ధరలు  పెరిగాయి.  గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్‌ ధరను పెంచారు. శుక్రవారం  లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.81.94 కి చేరింది. 13 రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై రూ.1.51 పైసలు పెంచాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. డీజిల్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర రూ.73.56పైసలుగా ఉంది.