కరోనా మహమ్మారి దేశంలో తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా లాక్ డౌన్ విధిస్తూ వచ్చింది. ఈ నెల 18 నుండి క్రమంగా ప్రభుత్వ కార్యాలయాలూ తెరుచుకుంటున్నాయి. లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన ఉద్యోగులు, ఇప్పుడు ఆఫీసులకు వచ్చేందుకు సన్నద్ధమౌతున్నారు. అయితే, గర్భిణులు ఆఫీసులకు హాజరవడానికి మినహాయింపునిచ్చారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) విభాగం ప్రకటించింది. గర్భిణులు, వికలాంగులు, కరోనా రెడ్ జోన్లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసుకు హాజరు నుంచి మినహాయించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను కోరినట్లు పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్ & పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం మీడియాకు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే సర్క్యులర్ జారీ అయిందని, వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు అనుసరిస్తాయని భావిస్తున్నట్లు సింగ్ చెప్పారు. ప్రసూతి సెలవులో లేని గర్భిణీ ఉద్యోగులను కూడా కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించనున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్కు ముందు లేదా ప్రస్తుతం అనారోగ్యంతో ట్రీట్మెంట్ పొందుతున్న ఉద్యోగులకు డాక్టర్ ప్రిస్కిప్షన్ మేరకు మినహాయింపు ఇవ్వవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
గర్భిణులకు మినహాయింపు...