రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీఈసెట్ (ఫీల్డ్ టెస్ట్) పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జులై 24న ఈసెట్, జులై 25న ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4 వరకు పీజీఈసెట్, ఆగస్టు 5న ఎడ్సెట్, ఆగస్టు 6న లాసెట్, ఆగస్టు 7 నుంచి ఆగస్టు 9 వరకు పీజీఈసెట్ (ఫీల్డ్ టెస్టు) పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు