విశాఖ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మరో విషాదం


ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో గ్యాస్ లీకేజ్ ఘటన కలకలం రేపింది. రాయ్‌గర్‌లోని ఓ పేపర్ మిల్‌లో ట్యాంక్ క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో.. పేపర్ మిల్‌లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాయ్‌గర్ ఎస్పీ తెలిపారు. బాధితులను కలెక్టర్ యశ్వంత్ కుమార్, ఎస్పీ సంతోష్ సింగ్ పరామర్శించారు.


ఘటన గురించి ఆరా తీశారు. పేపర్ మిల్ యజమాని ఘటనను దాచే ప్రయత్నం చేశాడని, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఎస్పీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సంతోష్ సింగ్ పేర్కొన్నారు.