గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్


కరోనా కట్టడి, ప్రజారోగ్యం కోసం ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలు, వార్డుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైరస్‌లు వ్యాప్తి చెందుతుండటంతో గ్రామ, వార్డు క్లినిక్స్ కీలకంగా మారతాయన్నారు. వైద్యపరంగా మౌలిక సదుపాయాలను పెంచుకునే ప్రక్రియలో భాగంగా వీటి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వార్డు క్లినిక్స్‌ను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, పాఠశాలల్లో నాడు–నేడు , గ్రామ సచివాలయాల నిర్మాణంపై ఫోకస్ పెట్టాలన్నారు.