వాట్సాప్ లో వస్తున్న ఫేక్ న్యూస్


వాట్సాప్ టిక్ మార్కుల గురించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజ్ ఫేక్ న్యూస్ అని పీఐబీ తెలిపింది. ప్రభుత్వం ఇటువంటి చర్యలేవీ తీసుకోవడం లేదని ట్వీటర్ లో పేర్కొంది.


వినియోగదారులు పంపే మెసేజ్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆ విషయం టిక్స్ ద్వారా యూజర్లకు తెలుస్తుందని ఆ మెసేజ్ సారాంశం. ప్రభుత్వం ట్రాక్ చేయడం, చర్యలు తీసుకునే విషయాలు కూడా ఆ టిక్స్ ద్వారా తెలుస్తాయని ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. ఏయే టిక్స్ వస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా మెసేజ్ లో ఉంది.



  • మూడు బ్లూ టిక్స్ - ప్రభుత్వం ఈ మెసేజ్ ని గుర్తించింది

  • రెండు బ్లూ టిక్స్, ఒక రెడ్ టిక్ - ప్రభుత్వం మెసేజ్ పంపిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది

  • ఒక బ్లూ టిక్, రెండు రెడ్ టిక్స్ - ప్రభుత్వం మెసేజ్ పంపిన వారి డేటాను పరిశీలిస్తుంది.

  • మూడు రెడ్ టిక్స్ - ప్రభుత్వం మెసేజ్ పంపిన వారిపై చర్యలు తీసుకుంది. వారు త్వరలో కోర్టు సమన్లు అందుకుంటారు.


అయితే పీఐబీ ఈ వార్తను ఖండించింది. ప్రభుత్వం అటువంటి చర్యలేవీ తీసుకోవడం లేదని తెలిపింది. అయితే వాట్సాప్ మెసేజ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ను కలిగి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కానీ, వాట్సాప్ కానీ ఈ మెసేజ్ లను చదవలేదు. కాబట్టి ఈ మెసేజ్ లను నమ్మి వాట్సాప్ కు దూరంగా ఉండకండి. ఈ లాక్ డౌన్ సమయంలో ఎక్కడో ఉన్న మనవారితో మనం కనెక్ట్ అవ్వడానికి ఇంతకంటే మంచి ప్లాట్ ఫాం మరోటి ఉండదు.