లాక్ డౌన్ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంపై ఏపీ సర్కారు దృష్టి సారించింది. లాక్ డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఏ విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదంటూ ఈ మేరకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
లాక్ డౌన్ తర్వాత తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలి