మీ సమీపంలో ఎవరికైనా కోవిడ్ సోకితే ఇట్టే తెలుసుకోవచ్చు

భారత ప్రభుత్వం అధికారిక కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టింది. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యాప్‌ను రూపొందించింది. ఎన్ఐసీ సూచనలను ఫాలో అవుతూ.. నాలుగు రోజుల్లోనూ ఈ యాప్‌ను రూపొందించడం గమనార్హం. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ లొకేషన్ డేటా, బ్లూటూత్ ద్వారా... కోవిడ్ సోకిన వ్యక్తి సమీపంలో యూజర్ ఉన్నాడా లేదా అని ఈ యాప్ చెబుతుంది. కరోనా పేషెంట్‌తో ఎవరైనా కాంటాక్ట్‌లోకి వస్తే.. వారి డేటాను ఈ యాప్ ప్రభుత్వానికి అందజేస్తుంది.


చేసుకొని, ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. కరోనా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ అందించే అప్‌డేట్స్‌ను కూడా ఈ యాప్‌లో పొందొచ్చు. అండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే లైవ్ ట్వీట్లను కూడా వీక్షించే వీలుంది.

ఈ యాప్ వాడాలనుకునే వారు తమ ఫోన్ నంబర్ సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ అండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్‌లోనూ అందుబాటులో ఉంది. 11 భాషల్లో కరోనా గురించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వార పొందొచ్చు.