డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్పే తాజాగా కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీని ఆవిష్కరించింది. దీని పేరు కరోనా కేర్. ఫోన్ పే ఈ పాలసీ కోసం బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వా్మ్యం కుదుర్చుకుంది. కోవిడ్ 19 బాధితులకు ఈ పాలసీ కవరేజ్ వర్తిస్తుంది.
కరోనా కేర్ పాలసీ ప్రీమియం రూ.156గా ఉంది. దీంతో రూ.50,000 వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. 55 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. కోవిడ్19కు ట్రీట్మెంట్ అందిస్తున్న ఏ హాస్పిటల్లో అయినా కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. కేవలం కరోనా వైరస్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా ప్రిహాస్పిటలైజేషన్కు నెల రోజుల ముందుకు వరకు ఖర్చులకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది.