శ్రీకాకుళం మహిళకు నారీశక్తి పురస్కారం..


అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే నారీశక్తి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో కన్నులపండువగా జరిగింది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గాను పలువురు మహిళలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారాలను అందజేశారు.