నిబంధనలు ఉల్లంఘించే వారిపై నేటి నుంచి చర్యలు మరింత కఠినం


విజయవాడ: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై విజయవాడలో అధికారులు నేటి నుంచి చర్యలను మరింత కఠినం చేయనున్నారు. నేటి నుంచి బహిరంగ స్థలాల్లోకి రైతు బజార్లను మార్చనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. నగరం వెలుపలతోపాటు నగరంలో రాకపోకలన్నింటినీ బంద్ చేశారు. లాక్‌డౌన్  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిన్న ఒక్కరోజే 70 కేసులు నమోదు చేశారు.