లాక్‌డౌన్‌లో వేతనాలు చెల్లించండి: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 23: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించడం గానీ, వేతనాల్లో కోత విధించడంగానీ చేయవద్దని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సూచించవలసిందిగా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ముఖ్యంగా క్యాజువల్‌, కాంట్రాక్టు వర్కర్ల విషయంలో మరింత సానుకూలంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సహకరించాలని సోమవారం కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి హెచ్‌కే స్మారియా విజ్ఞప్తి చేశారు.