ఎస్వీబీసీ వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారని పృథ్వీరాజ్ ఆరోపించారు. పోకిరి సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చింపేసి ఇక నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారని.. అలాగే తనపై కూడా అభాండం వేసి వదిలేశారని వాపోయారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను ఇందులో ఇరికించిన వారిని వేంకటేశ్వరస్వామే దందిస్తారని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టిన వారెవరూ ఇప్పుడు బతికి లేరని, తనను ఇరికించిన వారంతా నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. తనపై కుట్ర మొత్తం సొంత పార్టీ వారే చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా పార్టీని వదలబోనని స్పష్టం చేశారు.
చిరంజీవి లేకపోతే ఆత్మహత్యే గతి.. చెప్పుతో కొట్టి పంపారు.. పృథ్వీరాజ్ షాకింగ్ వ్యాఖ్యలు