తిరుమల: ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.600 కోట్లను వెనక్కి తీసుకుంది. అలాగే మిగిలిన ప్రైవేటు బ్యాంకులలో ఉన్న డిపాజిట్లు వ్యవహారంపై కూడా దృష్టిపెట్టింది. యస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో.. డిపాజిట్లు వెనక్కి తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఛైర్మన్ ఆదేశానుసారం డిపాజిట్లను టీటీడీ విత్ డ్రా చేసింది. ఇకపై బ్యాంకుల రేటింగ్ ఆధారంగా డిపాజిట్లు చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
యస్ బ్యాంక్ నుంచి రూ. 600 కోట్లు విత్ డ్రా చేసిన టీటీడీ